Categories
Standard Post

ఎన్టీఆర్ ఆరోగ్యరక్షకు ఎన్నారై వితరణ

ఇది మంచి పరిణామం. పుట్టిన ఊరికి మంచి చేసేందుకు ప్రవాస భారతీయులు ముందుకొస్తున్నారు. కృష్ణా జిల్లా పెదవుల పాకలో ఈ దిశగా మొదటి అడుగు పడింది. అమెరికాలోని టెక్సాస్ లో ఉంటున్న మేడి మాధవి తన గ్రామం లోని ప్రజలందరికీ ఎన్టీఆర్ ఆరోగ్య భీమా చేయించేందుకు ముందుకొచ్చారు. ఈ భీమా కోసం చెల్లించవలసిన మూడు లక్షల ప్రీమియం ను ఆమె చెల్లించారు. గ్రామంలోని 240 మందికి ఆమె భీమా ప్రీమియం చెల్లించారు. అందరికీ తానే చెల్లిస్తానని మాధవి చెప్పినా కొందరు ఆర్ధిక స్థోమత ఉన్నవాళ్ళు తమ ప్రీమియం తామే చెల్లించుకొన్నారు. ఇలాగే ఇంకా ఎంతో మంది తమ వంతు సహకారం అందించనున్నారు.

Leave a comment