గంగానది సంరక్షణ కోసం 112 రోజుల పాటు దీక్ష చేసి అక్టోబర్ 11న మరణించిన 81సంవత్సరాల కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ జే.డీ అగర్వాల్ దీక్ష స్పూర్తిని బచ్చేంద్రపాల్ అందుకున్నారు.ఈమె ఎవరెస్ట్ అదిరోహించిన తొలి మహిళ.బచ్చేంద్రిపాల్ 40 మంది వాలంటీర్లతో మిషన్ గంగ పేరిట గంగానది ప్రక్షాళన కోసం ముప్పై రోజుల పాటు పడవల్లో సాహసయాత్ర నిర్వహించబోతున్నారు.జలశుద్ది,నీటి వృధా నివారణ కై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సాగుతున్న ఈ యాత్ర దేశ వ్యాప్తంగా గంగానది ప్రవహించే 8 ప్రధాన నగరాలను కలుపుకుంటూ నడుస్తుంది. బచ్చేంద్రిపాల్ 1954 మే 24న జన్మించారు.

Leave a comment