Categories
Soyagam

అంతులేని మెరుపునిచ్చే ఫేస్ పాక్.

ఎలాన్టి చర్మ సమస్యకైనా పెరుగు చక్కని సమాధానం. విటమిన్ సి లాక్టిక్ యాసిడ్, కాల్షియం పుష్కలంగా వుండే పేరుతో ఫేస్ ఫ్యాక్ వేసుకుంటే చర్మం కాంతివంతంగా అయిపోతుంది. బియ్యం పిండి, పెరుగు, తేనె కలిపినా ఫేస్ ఫ్యాక్ తో మొటిమలు తగ్గిపోతాయి. పెరుగులో అలోవీలా జెల్ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే మొహం పై గీతాలు పగుళ్ళు పోతాయి. సెనగ పిండి, పెరుగు ఫేస్ ప్యాక్ తో మచ్చలు తగ్గుతాయి. అవిసేగింజలు నాననిచ్చి , గుజ్జుగా చేసి పెరుగులో కలిపి ఫేస్ ప్యాక్ వేస్తె నల్లబడిన చర్మం రంగు యధా స్ధితి కి వస్తుంది. పెరుగు, పసుపు కలిపి ప్రతి రోజు స్నానానికి ముందు పాక్ లా వేసుకుని, గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే మొహం పై నల్ల మచ్చలు పోతాయి. నిమ్మరసం, పెరుగు ఫసుప్యాక్ ఖరీదైన రసాయినాలున్న ఫేస్ ప్యాక్ వాలే బాగా పని చేస్తుంది. పెరుగు  మొహానికి అంతులేని మెరుపునిచ్చె చక్కని సహజమైన ఫేస్ పాక్.

Leave a comment