ఓట్ మీల్ ఆరోగ్యం కోసమే కాకుండా సౌందర్య పరిరక్షణలోనూ ఉపయోగపడుతుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఓట్ మిల్ మెత్తగా గుజ్జులాగా వండి అందులో నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే జిడ్డు చర్మం ఫ్రెష్ అయిపోతుంది. ఓట్ మీల్ పౌడర్ లో రోజ్ వాటర్ కలిసి ముఖం పై స్క్రబ్ చేస్తే బ్లాక్ హెడ్స్ పోతాయి. ఓట్ మిల్ పౌడర్ నీళ్ళతో కలిపి లేదా పాలతో కలిపితే మంచి ఫేస్ ప్యాక్ తయారవుతుంది. ఓట్ మిల్ పౌడర్ లో వట్టి నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ వేసి పదినిమిషాల్లో కడిగేసి ఆ తడి చర్మం పైన మాయిశ్చరయిజర్ రాస్తే చర్మం పై మచ్చలు పోతాయి.

Leave a comment