వెండితెర తారల్లో మెరిసిపోవటం వెనుక ఎంతో కఠోరమైన కఠిన శ్రముంటుంది.ప్రపంచ యాత్రలు చేసేంత డబ్బు గడించవచ్చు గానీ బయటి ప్రపంచంలో అలా రోడ్డుపైకి వచ్చి ఒక చాక్లెట్ కొనుక్కోవటం కూడా సమస్యే.స్వేచ్చ చేతులారా పోగొట్టుకోవలిందే. భారత్ అను నేను సినిమాలో దిశాపటాని ట్రూ పేజ్ ఆర్టిస్ట్ పాత్ర పోషిస్తోంది. సర్కస్ లో ట్రూ పేజ్ ఆర్టిస్ట్ లు తాళ్ళతో వేలాడుతూ స్టంట్స్ చేస్తారు. ఎంతో ప్రాక్టీస్ శ్రమ కావాలి దానికీ. ఈ పాత్ర కోసం దిశ పటాని ప్రతి రోజు ఆరుగంటల పాటు ప్రాక్టీస్ చేస్తుంది. అయితే ఎంత సిన్సియర్ గా ఆ ఫీట్లు నేర్చుకొందంటే ఏళ్ళ తరబడి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారట.దిశా పటాని అంత స్పీడ్ గా అవన్నీ నేర్చుకొందట మరీ.

Leave a comment