మూడేళ్ళ పిల్లలు కూడా అస్తమానం స్మార్ట్ ఫోన్ తోనే ఆడుతుంటారు. ఆ ఆడే ఆటలే లోకంగా ఉంటే వాళ్ళలో ఎమోషనల్ డెవలప్ మెంట్ తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయితే పక్కన ఉంగే పిల్లలతో మాట్లాడటం తగ్గిపోతుంది. సోషలైజ్ కాకపోతే ఎవరితో ఎలా కలిసి పోవాలో వారికి తెలియదని ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. పిల్లలు స్మార్ట్ ఫోన్ ,ల్యాప్ టాప్ తెరలపైన హైటెక్ గేమ్స్ ఆడుతోండటం చూసి తల్లిదండ్రులు సంతోషంగా ఫీలవుతున్నారనీ అది పిల్లల విషయంలో చాలా ప్రమాదం అంటున్నారు. పిల్లలకు షేరింగ్ ,తోటి పిల్లలతో ఆడుకోనే అవకాశాలు కల్పించకుండా స్మార్ట్ ఫోన్ వాళ్ళని మెయిన్ టెయిన్ చేస్తే వాళ్ళలో మానసిక వికాశం ఉండదంటున్నారు.

Leave a comment