దర్శకురాలు రీమాదాస్ ,రచయితగా నిర్మాతగా ,ఎడిటర్ గా ఛాయా గ్రహకురాలుగా అన్ని తానే అయి నిర్మించిన విలేజ్ రాక్ స్టార్ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాల పోటీకి భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో అ అస్సామీ చిత్రం విలేజ్ రాక్ స్టార్ పోటీల్లో నిలబడనున్నది.ఒక నిరుపేద బాలిక రాక్ బ్యాండ్ నడపాలన్న తన కోరిక నెరవేర్చుకొనేందుకు ఎంత తపించిందో ఈ చిత్రం అద్భుతంగా చూపెడుతోంది. అసోంలోని ఒక కు గ్రామంలో చాలా తక్కువ బడ్జెట్ తో నటన లో పరిచయం లేని కొత్త వాళ్ళతో రీమాదాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ సంవత్సరం జాతీయ ఉత్తమ చిత్రంగా పురష్కారం అందుకొంది.

Leave a comment