కరోనా కట్టడి చేసేందుకు తన వంతుగా తన ఆఫీస్ నిర్మాణ భవన్ లో 24 గంటలూ శ్రమపడుతున్నారు ప్రీతి సుడాన్. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కేడర్ కు చెందిన సీనియర్ ఐ.ఎ.ఎస్ అధికారిణి సుడాన్ ప్రస్తుతం న్యూఢిల్లీ లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సోషల్ పాలసీ అండ్ ప్లానింగ్ లో పి జీ చేసిన ప్రీతి ఎంఫిల్ కూడా పూర్తి చేశారు. కేంద్ర సర్వీసుల్లో చేశారు. కరోనా మహమ్మారి కట్టడిలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ తో కలసి ఎప్పటి కప్పుడు ప్రణాళికలు రచిస్తూ అటు కేంద్రం లోను ఇటు ఆయా రాష్టాల్లోని వివిధ డిపార్ట్ మెంట్ లకు సూచనలు ఇవ్వటం లో ప్రీతి బిజీగా ఉన్నారు మోది కార్యాలయానికి కరోనా విషయంలో ఎలాటి సమాచారం కావాలన్నా ఇస్తారు.

Leave a comment