17ఏళ్ళ వయసులో 7వ తరగతి చదువుతూ ఉండగా పొరుగునా ఉండే 55 ఏళ్ళ వ్యక్తి పెళ్ళాడనని చెప్పిన పాపానికి యాసిడ్ దాడికి గురైంది ఉత్తర ప్రదేశ్ యు చెందిన అమ్షా రాజ్ పుత్. రైతు కుటుంబంలో పుట్టిన అమ్షా , తోబుట్టువులతో సంతోషంగా ఉండేది. పక్కింటి దాదాజీ అని పిలిచే 55 ఏళ్ళ వ్యక్తి అమ్షాని పెళ్ళాడమని కోరారు. ఇంట్లోవాళ్ళు అతనాతో తగువుపడ్డారు. ఆ రాత్రే నిద్రపోతున్న అమ్షాపైన యాసిడ్ పోసి పరారయ్యాడాయన .టీనేజ్ లో ఉన్న అమ్షా అందంపోయి ఒక కన్ను పోయి రెండో కన్ను సగం కనిపించకుండా పోయి నిస్సహాయురాలైంది. కానీ ఆమె ధైర్యం పోగోట్టుకోలేదు కాలిపోయిన మొహాం భయంకరంగా ఉందని స్కూల్ వాళ్ళు రావోద్దంటే పోరాడి చదువుకొని లైబ్రరీ ఉద్యోగం వెతుక్కుని తన కాళ్ళపై తానునిలబడింది. ఈమె జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం.

Leave a comment