ఇప్పుడు రెండో సారి గర్భం దాల్చాను. క్రితం సారి లాగా ఒత్తిడితో లేను. ఈసారి సులువుగా సన్నబడి పోతాను అంటూ నటి సమీరా రెడ్డి ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ వెనకో కథుంది. తీరైన శరీరాకృతిలో ఉన్న సమీరా రెడ్డి మొదటి బిడ్డకు జన్మ ఇచ్చాక 102 కేజీల బరువు పెరిగింది. జుట్టు ఊడిపోయింది, దీన్తో సమీరా బయటికి రాలేకపోయింది. దీనితో ఎన్నో వ్యాయమాలు చేసి సన్న బడిపోయింది.ఈ బరువు తగ్గించటంలో ఉన్న సులువులు ఇప్పుడు వంటబట్టాయంటుంది .ఈమె లాగే ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు బిడ్డకు జన్మనిచ్చాక బరువు పెరిగి మళ్ళీ జీరో సైజ్ కు మారారు. డాక్టర్స్ దీని గురించి ఈ కాలపు అమ్మాయిలకు వివరిస్తూ గర్భవతిగా ఉన్నప్పుడు పెరిగే బరువును కాస్త పరిమితంగా ఆహారం తీపుకొని వ్యాయమాలు చేసి సన్నబడవచ్చు. దీని గురించి ఆలోచించి మనసు పాడుచేసుకొవద్దు అంటున్నారు.

Leave a comment