ఈ లాక్ డౌన్ సమయంలో దంపతుల మధ్య అనుబంధం ఎంతో బలపడినట్లు ఒక అధ్యయనం చెపుతోంది. ఇళ్లల్లోనే ఉండిపోయిన వారిలో 47 శాతం పెళ్లి చేసుకొన్నవాళ్ళు లేదా బంధం లో ఉన్నవాళ్లలో 38 శాతం మంది తమ భాగస్వామి పైన ఇష్టం,ప్రేమ పెరిగాయని చెప్పారు.  90 శాతం మంది కొత్తగా పెళ్ళైనవాళ్లు సహజీవనం తో ఉన్నవాళ్లలో తాము ఎక్కువ సమయం గడపగలిగినందువల్లనే ఎక్కువ అర్ధం  చేసుకోగలిగామని,ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు పెంచుకొన్నామని భాగస్వామితో దాపరికం లేకుండా మాట్లాడ గలిగినందుకు తమ సంతోషం 40 శాతం పెరిగిందని చెప్పారు. ఈ లాక్ డౌన్ లో తమ అనుబంధాలు మరింత పటిష్టంగా  తయారయిందని చెప్పారు.

Leave a comment