నిద్రపట్టకపోవడం చాలా విసిగించే సమస్య.ప్రపంచం మొత్తం ప్రశాంతంగా నిద్రలో ఉంటె నిద్రపట్టని వాళ్ళ సంగతి ఏమిటి. వెంటనే నిద్ర మాత్రలను ఆశ్రయించాలి కానీ ఈ నిద్రమాత్రలతో మిగతా ఆరోగ్య సమస్యలు సంగతి ఎలా ఉన్న మతిమరపు వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నాయి అద్యయనాలు. నాలుగు లక్షలమంది వృద్దుల పైన చేసిన అద్యయనం ఈ విషయం తేల్చి చెప్పింది. వైద్యుల సలహా పైనే నిద్రమాత్రలు వాడాలని లేకుంటే ప్రాణాంతక సమస్యలు తప్పవని అంటున్నారు. సహజంగా వయసు పెరిగిన కొద్ది నిద్రపోయే సమయం తగ్గుతుందని కొంతసేపు చదువుకోవడం ప్రశాంతంగా ఉండేందుకు బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ వంటివి అలవర్చుకోమంటున్నారు.

Leave a comment