నాలుగు దశాబ్దాలుగా కూచిపుడి నృత్య సాధన చేస్తున్న దీపికా రెడ్డి 2011వ సంవత్సరానికి గాను కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకున్నారు.ఆమె తల్లి రాధికా రెడ్డి నృత్య వారసత్వమే తాను అందిపుచ్చుకున్నదంటారు దీపికారెడ్డి.ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ కళారత్న అవార్డు అందుకున్నారు.2016లో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందింది. తెలుగు విశ్వ విద్యాలయ కీర్తి పురస్కారం అందుకున్నారు,విదేశాల్లో మొత్తం 30 దేశాల్లో ప్రదర్శన లిచ్చారు. వెంపటి చిన సత్యం గారి శిష్యురాలు ఆమె.

Leave a comment