శనివారం బాలాజీకి ప్రసాదం నైవేద్య పెట్టి అందరినీ పిలిచి విష్ణు సహస్ర నామం చదువుకుందామా!!

హైదరాబాద్ అనగానే చూడవలసిన ప్రదేశాలలో ముఖ్యమైనది బిర్లా టెంపుల్.
దీనిని నౌబత్ పహాడ్ అని అంటారు.ఇక్కడ భక్తుల కొరకు వేంకటేశ్వర స్వామిని ప్రత్యక్ష దైవంగా స్థాపించారు.ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది.పచ్చని చెట్లు,పాలరాతితో నిర్మించారు.ఇక్కడ యాగశాలలో హోమాలు కనులారా వీక్షించటం అదృష్టం.వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే స్వరూపుడుగా నయనానందకరంగా అలంకరించి సేవ చేసే భాగ్యం కలుగుతుంది.

నిత్య ప్రసాదం: కొబ్బరి అన్నం,పులిహోర, పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం పొందుతారు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment