ఫ్రెండ్ షిప్ బాండ్స్ ,రాఖీలు మార్కెట్ లో ఎన్నో వెరైటీలు కనిపిస్తూవుంటాయి. ఉదయం కట్టిన ఈ బాండ్స్ సాయంత్రానికి తీసేస్తారు. ఇంత పవిత్రమైన బంధాన్ని ఆలా తీసి పారేయటం గా కాకుండా విత్తనాల బాండ్స్ వచ్చాయి . ఇంచక్కగా డిజైన్ చేసిన ఈ రాఖీలో పూల మొక్కలు ఆకు కూరలు విత్తనాలుంటాయి. ఈ ఎకో ఫ్రెండ్లీ బాండ్స్ ను ‘మట్టిలో పాతి కాసిని నీళ్ళు పోస్తే కొన్ని రోజులకే మొలకలు వచ్చి, స్నేహ బంధాన్ని పటిష్టం చేస్తాయి. టెర్రికోట్,ఎర్రమట్టితో చేసిన రాఖీలు కూడా ఎకోఫ్రెండ్లీ . తేలిగ్గ మట్టిలో కలిసిపోతాయి. ఇప్పుడు రాఖీ కిట్ లో కూడా వచ్చాయి ఇందులో ఒక రాఖీ,మట్టితో నింపిన కుండీ కుంకుమ,అక్షింతలు ఉంటాయి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలనే కోరికతో వచ్చాయి ఈ ఎకోఫ్రెండ్లీ బాండ్స్.

Leave a comment