వెన్న తో చేసిన ఫేస్ ప్యాక్ ముఖానికి చక్కని మృదుత్వాన్ని ఇస్తుంది. టీ స్పూన్ వెన్నెలో టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా కలుపుకోవాలి. ఈ మిశ్రమం తో ఫేస్ ప్యాక్ వేసుకుని అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే చర్మం మృదువుగా నిగారింపు తో ఉంటుంది. అలాగే టీ స్పూన్ వెన్నెలో అరటిపండు గుజ్జు కలిపి ముఖానికి మెడకు మర్దన చేసి అరగంట తర్వాత కడిగేయాలి. కీరా దోస పేస్ట్ లో ఇందులో టీ స్పూన్ వెన్న కలిపి ఫేస్ ప్యాక్ వేసుకొని పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఫేస్ ప్యాక్ కడిగేసిన తర్వాత తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

Leave a comment