వయసు పెరిగే ముందు వచ్చే పిగ్మెంటేషన్ ముఖంపై మచ్చలు అరటిపండుతో మాయం చేయచ్చు అంటుంది సీనియర్ సినీ నటి భాగ్యశ్రీ. ప్రేమ పావురాల తో ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యాం లో నటిస్తోంది. తన సౌందర్య రహస్యం గురించి చెబుతూ ముఖంపై ముడతలు మచ్చలు అరటిపండుతో పోతాయి అంటోంది భాగ్యశ్రీ. రోజుకోసారి అరటిపండు తొక్కతో మొహం పై మృదువుగా మర్దన చేసి, పావుగంట తర్వాత కడిగేస్తే మొహం మెరుపులు మెరుస్తుంది అంటోంది భాగ్యశ్రీ. ఇందులోని ఫెనాలిక్ చర్మంలోని సూక్ష్మజీవులను సంహరించి పిగ్మెంటేషన్ తొలగిస్తుంది. అని చెప్పే భాగ్యశ్రీ ఆరోగ్యనిపుణురాలిగా అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ డ్రగ్ లెస్ ప్రాక్టీషనర్స్ నుంచి గుర్తింపు పొందుతుంది.

Leave a comment