ఎన్నో రకాల పరిశోధనలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఎలా వుంటే ఫ్యాషన్, ఎలా తింటే ఆరోగ్యం, ఎలా ప్రవర్తిస్తే మర్యాద ఇవన్నీ జీవనశైలితో పాటు మారిపోతున్నాయి కదా. ఇప్పుడు చదువుకీ, వ్యక్తి ఆరోగ్యానికి ఉన్న సంబంధం గురించి ఆస్ట్రేలియా పరిశోధకులు సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. సుమారు 3 లక్షల మంది విద్యాధికుల పైగా మిగతా డిగ్రీ లోపే ఆపేసిన వారిపైన ఈ అధ్యయనం కొనసాగింది. డిగ్రీ చదివిన వారి కన్నా ఇంటర్ తో ఆపేసిన వాళ్ళే ఎంతో అనారోగ్యాల బారిన పడి ఉన్నారని, ఒత్తిడితో గుండెపోటు తెచ్చుకునే వారి శాతం అధికంగా ఉందని తేలింది. అధ్యయనాన్ని విశ్లేషిస్తే చదువుకొన్నవారు మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడితే, ఇంటర్ లో ఆపేసిన వారిలో అభద్రతా భావం ఎక్కువగా ఉండటం, మంచి ఆహారం తీసుకునే అవకాశం లేకపోవడం, ఇక వైద్య భద్రత, కుటుంబ సంక్షేమం ఏదీ లేని కారణం గా ప్రతి చిన్న విషయానికీ ఒత్తిడి కి లోనయ్యారని తేలింది. తక్కువ చదువు, తక్కువ సంపాదన జీవితంలో అభద్రతకు దారి తీశాయని అధ్యయనాలు తేల్చాయి. అంటే చదువుకోవడం అన్ని విధాలా లాభదాయకం అని తేలింది. సో.. పిల్లల చదువు విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోవాలో అర్ధం చేసుకోవచ్చు.

Leave a comment