ఛోటూ కి ఎడ్యుకేషనల్ స్కూల్ ప్రారంభించింది ఫార్మా కంపెనీ యువ శాస్త్రవేత్త యువనేశ్వరి ఇక్కడ లెక్కలు ఇంగ్లీష్ నేర్పుతారు అల్పాహారం మధ్యాహ్న భోజనం ఉంటుంది. 100 మంది పైగా చిన్న పిల్లలు చదువుకొని రెగ్యులర్ పాఠశాలల్లో చేరారు.ఇక్కడ చేరే పిల్లలందరూ బిక్షాటన లో ఉన్నవాళ్ళ పిల్లలు యువనేశ్వరి బి ఫార్మసీ చేసింది. భూమి స్వచ్ఛంద సంస్థ లో నేషనల్ కో ఆర్డినేటర్ గా కూడా పనిచేస్తుంది. వీధిబాలలను తన పిల్లలే అనుకొని వారి ఆలనా పాలనా చదువు బాధ్యత తీసుకుంది యువనేశ్వరి. హైదరాబాద్ లోని జింకార్ నగర్ కాలనీ లో ఉంది ఈ రేకుల షెడ్ స్కూల్.

Leave a comment