కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోవటంతో స్మశానవాటిక కు దూరంగా ఉండమని నా స్నేహితులు సన్నిహితులు సలహాలు ఇస్తారు.కానీ బాధిత కుటుంబాలకు నా అవసరం ఉంది అనిపిస్తోంది అంటున్నారు అన్నా మోరిస్. కోవిడ్ పోరులో నేను సైతం అంటూ బెంగుళూరు లోని ఒక స్మశానవాటికలో స్వచ్ఛందంగా సేవలు అందిస్తోంది అన్నా మోరిస్. 43 సంవత్సరాల అన్నా మోరిస్ శునకాల శిక్షకురాలు గాయపడిన జంతువులకు ఆశ్రయం కల్పించే ఓ సంస్థతో కలిసి పని చేస్తున్నారామె. ఇప్పుడు బెంగళూరు లోని శాంతి నగర్ లో ఉన్న ఇండియన్  క్రిస్టియన్ సెమెంట్రీ లో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు అన్నా మోరిస్.

Leave a comment