ఢిల్లీ నుంచి 16 ఏళ్ల అషిర్,అశిశ్ కంధారి అన్న కవల పిల్లలు కోవిడ్-19 హెల్ప్ లైన్ నడుపుతున్నారు.ఇద్దరూ పదో తరగతి పరీక్ష రాశారు.క్లిష్ట సమయంలో అవసరాలకు సాయం అందించేందుకు తమ స్నేహితుల డెలివరీ సర్వీస్ లో, ఆ దుకాణాలు, కాలేజీ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు కార్యకర్తలతో కలసి మందులు, ఆహారం పేద, మధ్య తరగతి వాళ్లకు ఉచితంగా ఇస్తున్నారు.ఈ అక్క చెల్లెలు ఢిల్లీ పోలీస్ లు, అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు ఢిల్లీ తో పాటు దేశంలోని 30 పట్టణాలకు తమ సేవలను విస్తరించారు.ఎలాంటి సంకోచం లేకుండా స్థానిక ఎమ్మెల్యే ను జిల్లా న్యాయమూర్తి ని సంప్రదించి అధికారుల పైన ఒత్తిడి తెచ్చి ప్రజల ఇబ్బందులు పరిష్కరించేలా చూస్తున్నారు.

Leave a comment