రత్నాలు వజ్రాలు పొదిగిన షిప్ ఇవ్వాల్టి ట్రెండ్ .అందమైన నావలను అమ్మాయిల మెడలో ఆభరణాలుగా మార్చాలని ఏ కళాకారుడు ఊహించరో గానీ ఈ అందాల హంస నావలు అమ్మాయిల కళ్ళను కట్టేస్తున్నాయి.త్రీడి లాకెట్లు లాగా ఎటువైపు నుంచి చూసినా అచ్చం నవలాగా కనపడతాయి .పచ్చలు,కెంపులు,వజ్రాలు విలువైన రకరకాల రత్నాలు , ఎనామిల్ రంగులతో వేలాడే ముత్యపు గుత్తులతో ఇవి సల్వార్ లు , జీన్స్ , చీరాల పైకి కూడా చాల బావుంటాయి .ఎప్పుడో 19వ శతాబ్దం లో రాణుల మెడల్లో ఇలాంటి లాకెట్లు ఉండేవి .అప్పట్లో ఓడల్లో జరిగే వ్యాపారాభివృధికి సూచికగా ఇలా నౌకల బొమ్మలు హారాల్లో ధరించి వాళ్ళట .మళ్ళీ ఇప్పుడు ఇవి ట్రెండీ జ్యువెలరీ .

Leave a comment