వైజాగ్ కు చెందిన అపురూప పర్యావరణానికి నదులకు మనుష్యులు ఎలా అపకారం చేస్తున్నారు చూపించే చక్కని ఫోటోలు తీసింది . దీన్ని రివర్స్ ప్రోజక్ట్ పేరుతో ప్రదర్శనకు పెట్టింది అపురూప . గోదావరి ,గంగ,కావేరి మొదలైన ఎనిమిది నదులకు దృశ్యరూపం ఇచ్చింది . ఆ నదుల గురించి పురాణాల్లో వచ్చిన ప్రస్తావనాలన్నీ చదివి వాటిని ఫొటోల్లోకి తీసుకువచ్చింది. నదులను దేవతల్లా కొలిచే వాళ్ళు కూడా భక్తి పేరిట ,లేదా అజ్ఞానం కొద్దీ అ నదుల్లోకి తీసుకు వస్తున్న కాలుష్యం గురించిన ఈ ఫోటోలు ఎంతో ఆలోచింప జేసేవిలా ఉన్నాయి .

Leave a comment