తలకి చుండ్రు పట్టుకుంటే ఎన్ని మందులు వాడుతున్నా వదలకుండా విసిగిస్తూ ఉంటుంది. ఖరీదైన మందులు వాడి ఇంకా తగ్గటం లేదు అనుకుంటే  ఇలా చేసి చుస్తే ఫలితం ఉండచ్చు. పుష్కలంగా యాంటీ  ఫంగల్ గుణాలున్న పెరుగులో నల్ల మిరియాల పొడి కలిపి అప్లయ్ చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. ఆయిలీ హేయిర్ ఉన్నవాళ్లు పండిన టమాటో  గుజ్జుతో ముల్తానీ మట్టి చేర్చి తలకు పట్టించి ఆరాక స్నానం చేసేసినా ఫలితం ఉంటుంది . నానబెట్టిన మెంతులు ఉదయాన్నే పేస్ట్ లాగా రుబ్బి తలకు పెట్టేస్తే ఫలితం ఉంటుంది. కలబంద గుజ్జులో  ఉండే యాంటీ బ్యాక్తీరియల్  గుణాలు కూడా ఫంగస్ ను తొలగిస్తాయి. నిమ్మరసం తేనె  కలిపి పట్టించినా మంచిదే. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ చుండ్రు తొలగిస్తుంది. తేనె  జుట్టుకు కావలిసిన మాయిశ్చరైజర్ అందిస్తుంది. రెండు స్పూన్ల సెనగపిండి పెరుగు కలిపి తలకు పట్టించి అరగంట ఆగాక కడిగేసినా  సమస్య తీరిపోయినట్లే. వీటిల్లో కొన్నయినా ట్రై చేయండి. ఇవి ఇంటి చిట్కాలు గనుక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు.

Leave a comment