ప్రతిరోజు వ్యాయామం చేస్తూనే ఉన్నాను ఖరీదైన పోషకాహారం తీసుకుంటాను. ఫిట్ నెస్ అంటే ప్రాణం పెడతాను హాయిగా నిద్ర పోతాను ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలో అన్నీ చేశాను. నాకు క్యాన్సర్ వచ్చే అవకాశం లేదనుకున్నాను కానీ అది అపోహే అని తేలిపోయింది. నాకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది అంటున్నారు జీరోధా సంస్థ కో పౌడర్ సీమా పటేల్, గత నవంబర్ నుంచి ట్రీట్ మెంట్  మొదలు కుటుంబం సభ్యుల మద్దతు, బీమా రక్షణ ఉంటే ఈ వ్యాధి జయించవచ్చు అంటూ వ్యాధిగ్రస్తులకు ధైర్యం చెబుతున్నారామె. కీమో కారణంగా జుట్టు రాలిపోయి గుండు చేయించుకున్న సీమా కు మద్దతుగా ఆమె భర్త కూడా గుండు చేయించుకుని లింక్డిన్ లో పోస్ట్ చేశారు ఆమె భర్త జీరోధా సీఈఓ నితిన్ కామత్ ఆయన పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a comment