న్యూరాలజీ ఆన్ వీల్స్ ఫౌండేషన్ పేరుతో నెల్లూరు లోని 30 గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తారు డాక్టర్ బిందు మీనన్. నరాల వ్యాధులు పక్షవాతం మూర్ఛ వంటి తీవ్ర సమస్యలు ఉన్న రోగులకు వైద్య పరీక్ష నుంచి శస్త్రచికిత్స వరకు ఒక్క రూపాయి కూడా రోగి నుంచి తీసుకోరు.బిందు సేవలకు గుర్తింపుగా 13 అంతర్జాతీయ, 24 జాతీయ అవార్డు లు మూడు ఫెలోషిప్ వచ్చాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెర్చి కమిటీ సభ్యురాలిగా ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ గ్రూప్ మెంబెర్  ఫర్ ఎపిలెప్సీ గా ఆమె కొనసాగుతున్నారు. రోగులకోసం ఎపిలెప్సీ హెల్త్ అనే యాప్ తీసుకువచ్చారు డాక్టర్ బిందు మీనన్.

Leave a comment