భారత జట్టు లో చాలా కీలకమైన స్థానంలో ఉంది సంధ్య రంగనాథన్  కడలూరు జిల్లా లో పుట్టింది సంధ్య జిల్లాస్థాయి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మెరిసింది. ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకుంది. ఫుట్‌బాల్ అంటే ప్రాణం పెట్టేది స్నేహితులు, దాతల ప్రోత్సాహంతో పోటీలకు వెళ్ళేది. చివరికి జాతీయ జట్టుకు ఎంపికైంది. గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన జాతీయ క్రీడలలో మూడు మ్యాచ్ ల్లో ఏకంగా 12 గోల్స్ చేసి సత్తా చాటింది. యు ఎస్ ఏ, స్వీడన్, బ్రెజిల్ తదితర క్రీడల్లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో తానేమిటో నిరూపించుకుంది సంధ్యా రంగనాథన్.

Leave a comment