పండ్లు తినటం అయినా పండ్లతో చేసిన జ్యూస్ తాగటం అయినా ఒకటే అనుకొంటారు కానీ ,ఈ పండ్ల రసం తాగటం వల్ల ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు పరిశోధకులు . పండ్ల రసం తాగటం అంటే పంచదార పానీయం తాగటమే అంటున్నారు . ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పీచు,పండ్లలో ఎక్కువ శాతం ఉంటుంది . పండ్ల రసంలో ఈ పీచు పదార్దాలు ఉండవు . పీచు లేని వట్టి రసం తాగటం వల్ల ఎలాటి ఆరోగ్య లాభం లేదని చెపుతున్నారు . హాయిగా రెండు పండ్లు తినటం ఉత్తమం అంటున్నారు .

Leave a comment