ఆదిలాబాద్ జిల్లాలో 11 కేసులు కరోనా కేసులు నమోదయ్యాయి .అటువంటి విపత్కార పరిస్థితిలో పక్కా వ్యూహం తో చక్కని ప్రణాళిక తో ముందుకొచ్చారు కలెక్టర్ శ్రీ దేవసేన .కరోనా సోకినా ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించి మూడు కిలోమీటర్ల పరిధి లోని కాలనీలు, ఇతర ప్రాంతాల దారులు పూర్తిగా మూసివేయించి ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు, ఔషదాలు అందే ఏర్పాటు చేశారు దేవసేన .సామజిక స్ప్రిహ కలిగిన స్థానిక యువతను గల్లీ వారియర్స్ పేరుతో నియమించి వారి ద్వారా సేవలందింస్తున్నారు .ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు .అనారోగ్య సమస్యలు తీర్చేందుకు టెలిమెడిసిన్ విభాగం ఏర్పాటు చేయించారు .

Leave a comment