ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించటం కోసం చేపట్టిన ఆపరేషన్ గంగ లో భాగంగా ఢిల్లీకి చెందిన శివానీ ఆమె బృందం 249 మంది విద్యార్థులను భారతదేశానికి చేర్చారు. ఈ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి చి రొమేనియా, హంగరీలకు శరణార్థులుగా వెళ్లారు. బుడాపెస్ట్‌, రొమేనియాల నుంచి విద్యార్థులను ఢిల్లీకి తీసుకు వచ్చాము. యుద్ధం ముగిసే లోగా నేను నేనెన్నో రెస్క్యూ ఫ్లైయిట్ లను నడపవలసి రావచ్చు. ఎప్పుడు పిలుపు వచ్చినా నేను వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను అంటుంది మహిళ పైలెట్ శివానీ కార్ల. కొవిడ్ సమయంలో కూడా నేను ఇవాక్యుయేషన్‌ , రెస్క్యూ ఫ్లయిట్లు నడిపాను. విద్యార్థులను ఇళ్లకు చేర్చగలగటం లో నా పాత్ర ఉండటం నేను గర్వంగా భావిస్తున్నాను అంటుంది శివానీ కార్ల.

Leave a comment