గీత రామస్వామి నిర్వహణలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 40ఏళ్ళు పూర్తి చేసుకొంది దళిత సాహిత్యం నుంచి జీవిత కథలు విజ్ఞానశాస్త్రం మూలికా వైద్యం వరకు తెలుసుకోవలసిన అన్ని అంశాలను అచ్చులోకి తెచ్చింది. హెచ్ బిటి మహారాష్ట్ర లోని షోలాపూర్ లో జన్మించిన గీత ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థుల వామ పక్ష ఉద్యమంలో పనిచేశారు. జార్జిరెడ్డి తమ్ముడు సరిత్ రెడ్డి ని పెళ్ళి చేసుకున్నారు. ప్రగతి శీల మహిళా సంగం సంస్థాపకుల్లో ఒకరు.పారిశుద్ధ్య కార్మికుల కోసం పనిచేశారు. తరువాత తెలంగాణ రైతాంగ సమస్యల హక్కులపైనా పని చేశారు. స్త్రీ వాదం దళిత వాదం,పర్యావరణం మొదలైన సమస్యలపైనా చక్కని పుస్తకాలు తీసుకొచ్చారు.

Leave a comment