ఆయుర్వేద వైద్యంలో కోవిడ్ ను సమర్ధవంతంగా కట్టడి చేయవచ్చునని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ చెబుతోంది కరోనా తో సహా కాలానుగుణ వ్యాధులు  అరికట్టేందుకు ఆయుర్వేద విధానాలు అనుసరించాలని సూచించింది.గోరు వెచ్చని నీరు తాగటం ద్వారా శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.యోగా ప్రాణాయామం ధ్యానం చేయాలి.ఉదయాన్నే 10 గ్రాముల చవన్ ప్రాష్ తీసుకోవాలి గోరు వెచ్చని  నీటిలో పసుపు వేసి తాగాలి పసుపు జీలకర్ర కొత్తిమీర వెల్లుల్లి వంటల్లో తప్పనిసరిగా వాడాలి.తులసి దాల్చిన చెక్క మిరియాలు అల్లం ఎండుద్రాక్ష బెల్లం నిమ్మరసం తో కషాయాన్ని తయారుచేసుకోని తాగాలి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె లు నోటిలో వేసుకుని పుక్కిలించి ఉమ్మి వేసి నోరు శుభ్రంగా చేసుకోవాలి. దగ్గు వస్తే బెల్లం లేదా తేనెలో  కలిపిన లవంగాల పొడిని రెండు మూడుసార్లు తీసుకోవాలి.

Leave a comment