ఒక కొత్త జంట సహృదయంతో ఒక గొప్ప పనిని తమ హనీమూన్ ప్లాన్ చేశారు.అనుదీప్ హెగ్డే మినుషా కాంచన్ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.తమ సొంత ప్రాంతమైన కర్ణాటకలో బైద్దూర్ లో ఉన్నారు దగ్గరలో ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని సోమేశ్వర్ అంటారు.అక్కడ అన్ని ఖాళీ మద్యం సీసాలు ప్లాస్టిక్ చెత్త తో నిండి ఉండటం చూశారు. అప్పటివరకు హనీమూన్ కోసం లక్షద్వీప్ లేదా హిమాచల్ ప్రదేశ్ అనుకున్న వాళ్లు ఆ ప్లాన్ ని రద్దు చేసుకుని,చేతి తొడుగులు బ్యాగ్ తీసుకొని నవంబర్ 27 నుంచి డిసెంబర్ 3 మధ్య ఈజంట 600 కిలోల చెత్తను అక్కడి నుంచి తీసేసి క్లీన్ చేశారు.వాళ్లను చూసి అక్కడకు వచ్చిన వాళ్లు కూడా ఈ మంచి కార్యక్రమంలో పాలుపంచుకుని ఆ ప్రదేశాన్ని క్లీన్ చేసేశారు. కొత్త జంటకు ఆశీస్సులు అందాయని వేరే చెప్పాలా ?

Leave a comment