మేం సంవత్సరాలుగా తడి గుడ్డ పైనే ఇడ్లీలను ఉడకబెడుతూ ఉన్నాం అందుకే నా ఇడ్లీలకు అంత రుచి అంటుంది ఈ రోడ్ లోని ఇర్లీ సంత లో ఒక హోటల్ ఓనర్ తమిళనాడులోని ఈ రోడ్ లోని  కరుంగల్‌ పాళ్యం లో స్త్రీలే నడిపే 35 హోటళ్ళ సంత ఉదయం 5 నుంచి 9 వరకు సాగుతుంది. ఈ నాలుగు గంటల వ్యవధిలో అక్కడ రోజుకు పదివేల ఇడ్లీలు అమ్ముడుపోతాయి. పెళ్లిళ్ల సీజన్ లో 40 వేల ఇడ్లీలు అమ్ముతారు. ఒకే వరుసలో 40 షాపులు ఉంటాయి. 40 ఏళ్ల క్రితం ఇద్దరు స్త్రీలతో ప్రారంభమైన ఈ ఇడ్లీల హోటళ్లు ఇప్పటికీ ఇడ్లీల సంత గా మారిపోయాయి . రెండు ఇడ్లీలు 7 రూపాయలే. ఈరోడ్ నుంచి 150 రూపాయలు ఖర్చు చేసి ఆటోలో వచ్చి మరి ఈ ఏడు రూపాయలు ఇడ్లీలు తింటారంటే కరుంగళ్‌ పాల్యం ఇడ్లీ రుచి ఎంత బావుండాలి మరి !

Leave a comment