సాంకేతికంగా ప్రపంచం ఎంతో పురోగతి సాధించింది. కానీ పిరియడ్స్ విషయంలో ఆ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అమ్మాయిలను మహిళలను ఎడ్యుకేట్ చేసే పద్ధతులు ఏవి లేవు అంటూ తాప్సీ తన ఇంస్టాగ్రామ్ లో  ఒక వీడియో షేర్ చేశారు.మహిళలు బహిష్ఠు సమయంలో సాంప్రదాయ శానిటరీ పాడ్స్ ఉపయోగించడం వల్ల వచ్చే పిరియడ్ రాషెస్ చర్మం రంగు మార్చేసి జీవిత కాలం నల్లగా మచ్చలు మిగులుస్తాయి.ఇలాంటి ఎన్నో సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడక పోవటం వల్ల దానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఒక పరిష్కారం కనుక్కోవటం మరిచిపోతున్నాం. సమస్యను అలా వదిలేయద్దు. పట్టింపు లేనిదిగా ఊరుకోవద్దు. ఈ సమస్యలను  అందరి దృష్టికి తేవలసిన సమయం ఇదేనంటూ చెప్పుకొచ్చింది తాప్సీ పన్ను.

Leave a comment