పిల్లలకు కష్టసుఖాల గురించి తెలియదు ఆడుకునేందుకు బొమ్మలు చాలు 43 డిగ్రీల వేడి లో యూపీ, ఎం.పీ ల బోర్డర్ లో వలస కార్మికుల వాళ్ళ పిల్లల అలిసిపోతున్నారు.ఆ పిల్లల మొహాలలో నవ్వులు పూయించేదుకు ఝాన్సీ (యూ.పి) పోలీస్ లు ఆ పిల్లలకు బొమ్మలు పంచిపెట్టారు. ఎండలకు తట్టుకోలేక పిల్లలు తల్లులను  సతాయిస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చేందుకు బొమ్మలు పంచి పెడుతున్నాం అని ఝాన్సీ జిల్లా ఎస్.పి రాహుల్ శ్రీవాస్తవ అన్నారు. బొమ్మల్ని చూసే పిల్లలు ఆకలి దప్పులను అల్లరి ని మరిచిపోయిన పిల్లల వీడియోలను చూసి ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేసి ఝాన్సీ పోలీసులను అభినందించారు.

Leave a comment