70 ఏళ్ల కాంచన్ పరులేకర్ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం వద్దనుకున్నారు స్వయం సిద్ధ సంస్థ ద్వారా గత 30 ఏళ్లుగా 6500 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దారు.మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జన్మించిన తన తల్లిదండ్రులు చేసే సామాజిక సేవ వారసత్వంగా అందుకొన్నారు.ఎం. ఏ డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ పూర్తిచేసి బ్యాంక్ మేనేజర్ గా పనిచేసిన కాంచన్ పరులేకర్ 1992 లో స్వయం సిద్ధ లో పని చేసేందుకు పూనుకొన్నారు. బేకరీ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ వరకు బ్యూటీ పార్లర్ నుంచి హస్తకళల వరకు మహిళలు అన్ని వ్యాపారాలు ప్రారంభించేలా చూశారు.

Leave a comment