కథనాయికగా నటించటం సంతోషంగా ఉంది. ఈ చిత్రం కథనం పేరుకి తగ్గట్టే కథనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ప్రేక్షకులు థ్రిల్ అయిపోతారు. ఇందులో సహాయ దర్శకురాలి పాత్రలో కనిపిస్తాను .టీజర్ కు మంచి స్పందన వచ్చింది అంటోంది అనసూయ. ఆమె కథనాయికగా నటిస్తున్న కథనంలో అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అనసూయ,రణధీర్ ,ధన్ రాజ్ ,వెన్నల కిషోర్, పృధ్వీ నటిస్తున్నా ఈ సినిమా వినోదం మిలితమైన సరికొత్త థ్రిల్లర్ అంటున్నారు.

Leave a comment