పిల్లలు ఏం చెప్పబోయినా ఉండు నాకు అవతల పనుంది అని అంటుంటారు పెద్దవాళ్ళు.కానీ వాళ్ళు మనసులో ఏముందో వాళ్లు మీకు ఏం చెప్పాలనుకున్నారో కాస్త వినండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.  అమ్మా నాన్నకు చెబితే కొట్టట మో, తిట్టటంమో చేస్తారని భయపడే పిల్లలకు ఏ  విషయాన్నయినా ధైర్యంగా పంచుకునే స్వేచ్ఛ ఇమంటున్నారు. లేదంటే ఏదైనా సమస్య వస్తే వాళ్లు తమలో తాము కుంగిపోవడం మొదలుపెట్టి పెడతారు. పిల్లలు ఏమైనా  సందిగ్ధంలో ఉంటే వాళ్లతో స్నేహితుల్లా మెలిగి సరైన సలహా ఇవ్వాలి లేకపోతే వాళ్ళ కొచ్చిన సమస్యకు ఏ స్నేహితులతోనూ పంచుకోని ,తప్పుడు సలహాలతో దారి తప్పే ప్రమాదం ఉందంటున్నారు. పిల్లలకోసం బ్రేక్ ఫాస్ట్ లోనో, భోజనం సమయంలోనూ కాసేపు మాట్లాడాలి. వాళ్ల మనసు తెలుసుకోవాలి. వాళ్ళకి పెద్ద వాళ్ళే నిజమైన స్నేహితులు బంధువులు అనిపించాలి.

Leave a comment