ఒక్కసారి కూర లో నీళ్ళు ఎక్కువై కూర రుచి తగ్గిపోతుంది. అలాటప్పుడు చిక్కని గ్రేవీ దానికి జతచేయాలి. పెరుగు, ఫ్రెష్ క్రీమ్ చక్కగా కలిపి కూరలో వేసి కలిపితే దానికి కాస్త మసాలా కారం వేస్తే గ్రేవీ చిక్కగా రుచిగా వస్తుంది. అలాగే జీడిపప్పు నేతిలో వేయించి పాలలో కలిపి పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ ను కూడా వేసి పది నిమిషాలు ఉడికిస్తే గ్రేవీ చిక్కగా అవుతుంది.కార్న్ ఫ్లోర్ ను నీళ్లలో కలిపి కూర లో వేసిన గ్రేవీ చిక్కగా అవుతుంది.

Leave a comment