భర్త చనిపోయాక కూతురిని పెంచుకోవటం కోసం పురుష వేషం కట్టి ముత్తు మాస్టర్ గా మారిపోయింది తూతుకుడి జిల్లా కు చెందిన పెచ్చియమ్మాళ్ కు 20 ఏళ్ల వయసు లో గర్భం తో ఉండగా భర్త చనిపోయాడు. ఆ తర్వాత కూతురు పుట్టింది. ఒంటరి స్త్రీ ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నీ పడి చివరకు మగ అవతారం ఎత్తింది. కుతూ నాయకన్ పట్టి లో తన పేరు ముత్తు గా చెప్పుకొని హోటల్ లో పరోటా మాస్టర్ గా టీ మాస్టర్ గా చేరింది. 30ఏళ్ల గా మగవాడి గానే జీవించింది పెచ్చియమ్మాళ్ వయసు మీద పడ్డాక వితంతువు పెన్షన్ కోసం అప్లై చేసినప్పుడే ఆమె స్త్రీ అని అందరికీ తెలిసింది. ఆమె ఆధార్ కార్డు లో ముత్తు అని ఉండటంవల్ల పెన్షన్ ఇవ్వటం సమస్యగా ఉంది అంటున్నారు అధికారులు.

Leave a comment