గత సంవత్సరం మిస్ ఇంగ్లాండ్ గా ఎంపికైన భాషా ముఖర్జీ లక్ష్యం ప్రపంచ సుందరిగా కిరీటం గెల్చుకోవటం . కానీ కరోనా కల్లోలం తో ఆమె మనసు మార్చుకొని మళ్ళి విధుల్లోకి జాయిన్ అయింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన భాషా కుటుంబం బ్రిటన్ లో నివశిస్తారు. ఆమె నాటింగ్ హోమ్ విశ్వవిద్యాలయనుంచి మెడిసిన్ పూర్తి చేసింది ‘ది జనరేషన్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్’ అనే స్వచ్చంద సంస్థ నడుపుతోంది అయితే ప్రపంచ సుందరి కావాలనే కోరికతో సౌందర్యం పైన ద్రుష్టి పెట్టి అందాల పోటీలకు ఏంతో దీక్షతో తయారవుతూ ఉండేది. కానీ ఈ కరోనా విజృంభణ తో భాషా తన లక్షాన్ని పక్కన పెట్టి పిలిగ్రిం ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తోంది.

Leave a comment