పింగాణీ వస్తువులు చాలా అందంగా ఉంటాయి. వాటిని సరైన పద్ధతిలో శుభ్రం చేస్తే మెరుస్తూ ఉంటాయి. టబ్ లో ఓ చెంచా వెనిగర్ కొద్దిగా డిష్ వాష్ ద్రావణం వేసి అందులో నిమ్మరసం కలపాలి.ఈ నీటితో శుభ్రం చేయాల్సిన గాజు సామాను పావుగంట సేపు నానబెట్టి ఆ తరవాత స్క్రబ్ తో రుద్ది మంచి నీటితో కడగాలి అలాగే క్రిస్టల్ వస్తువుల పై మురికి పేరుకుపోతుంది. చెంచా వంటసోడా తో పావుచెంచా సింథటిక్ వెనిగర్ కలిపి అర చెంచా డిష్ వాష్ సోప్ కూడా వేయాలి. ఈ నీటితో వస్తువులపై రుద్దాలి అలాగే వంట సోడా కలిపిన గోరువెచ్చని నీళ్ళు పోసి పావుగంట నాననివ్వాలి తరువాత డిష్ వాష్ తో కడిగితే కొత్త వాటిలా మెరుస్తాయి.

Leave a comment