శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ ఇన్స్ పెక్టర్ శిరీష ,పొలం గట్టు పై నుంచి ఒ అనాధ శవాన్ని భుజంపై మోస్తూ ఉన్న వీడియో బయటకు వచ్చింది. అడవి కొత్తూరు  గ్రామ పంట పొలాల్లో గుర్తు తెలియని ఒక ముసలాయన శవం ఒంటిపై బట్టలు లేకుండా పడి ఉంది. గ్రామస్తులు తన దగ్గర పనిచేసే కానిస్టేబుల్స్ కూడా ఆ శవాన్ని మోసేందుకు నిరాకరించారు కానీ ఎసై శిరీష లలితా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుల సాయంతో ఆ మృతదేహాన్ని పొలం గట్లపై రెండు కిలోమీటర్ల దూరం మోసుకుంటూ రహదారిన చేర్చి అంత్యక్రియలకు తరలించారు. డీజీపీతో పాటు నెటిజన్లు కూడా ఆమెపై అభినందనల వర్షం కురిపించారు.

Leave a comment