అమెరికాలోని మియామీ వర్సిటీ నిపుణులు చేసిన ఒక పరిశోధనలో మహిళలే రోజు వారు అవసరంగా తాగే నీటి కంటే అదనంగా మూడు గ్లాసుల నీళ్ళు ఎక్కువగా తీసుకొంటే మూత్ర నాళం ఇన్ ఫెక్షన్లు రావని తెలసింది. మహిళల మూత్ర నాళం చాలా సన్నగా చిన్నదిగా ఉంటుంది. దీనితో జననాంగాల నుంచి మూత్రకోశానికి బాక్టీరియా చేరుకొవటం చాలా తేలికా. నీళ్ళను ఎక్కువగా తీసుకొంటే బాక్టీరియా మూత్ర నాళానికి అంటి పెట్టుకొని అందకుండా బయటికి పోతుంది అంటున్నారు . నీళ్ళుతాగిన వాళ్ళలో 48 శాతం వరకు ముప్పు తప్పిందని పరిశోధన చెపుతుంది.

Leave a comment