వడ్లు దంచి జల్లెడ పట్టి రుచిగా ఉండే దంపుడు బియ్యం తినే రోజుల్లో ఎంతో ఆరోగ్యంగా ఉండే వారు. ఇప్పుడు పాలిష్  బియ్యం వచ్చాయి.తెల్లని బియ్యం తప్పించి ఇంకొకటి ఊహ కూడా రావు. పోషకాలు కోల్పోయిన బియ్యం అధిక కేలరీలు పీల్చుకునేలా చేస్తుంది.గతంలో మాదిరి దంపుడు బియ్యం, ఇప్పటి మాదిరిగా కూరగాయలు పండ్లు వ్యాయామం గనుక ఉంటే క్యాలరీలు ఎంతో తగ్గిపోతాయి. ఒక అరగంట సేపు వేగంగా నడిస్తే ఎన్నో కేలరీలు ఖర్చవుతాయో, ఈ దంపుడు బియ్యం లో అసలా క్యాలరీలు శరీరంలోకి చేరవు దంపుడు బియ్యం రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది జీర్ణ నాళం లో మేలు చేసే బ్యాక్టీరియా పెరుగుతోంది ఈ బియ్యం బరువు తగ్గిస్తుంది కూడా.

Leave a comment