ప్రజల్లో కరోనా పట్ల అవగాహన పెంచేందుకు ఫేస్ మాస్క్ పరోటాలు తయారు చేశారు మధురై లోని టెంపుల్ సిటీ హోటళ్ళ లో మేనేజింగ్ డైరెక్టర్ కె. లక్ష్మణ్ కుమార్ కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్రయోగాలు చేయటం ఆయనకు అలవాటే.రజనీకాంత్ బాబా సినిమా విడుదల అయ్యాక బాబా పన్నీర్ బటర్ మసాలా దోసె,సచిన్ టెండూల్కర్ నూరవ సెంచరీ చేసినప్పుడు బ్యాట్ ఆకారంలో టెండూల్కర్ దోసే మొదలైనవి ఆహార ప్రియులకు అందించారు.మధురై లో మట్టు దావని బ్రాంచ్ లో ఈ మూడు పొరల మాస్క్ పరోటా తయారైంది.పిల్లలు ఈ కాన్సెప్ట్ ను ఎంతో ఇష్టపడుతున్నారు.

Leave a comment