రెండు అరటిపండ్లు తింటే 90 నిముషాల సేపు సంపూర్ణమైన శక్తి లో శరీరానికి శ్రమ ఇచ్చే పనులు ఈజీగా చేయవచ్చునని పరిశోధనలు ఏనాడో రుజువు చేసాయి. క్రీడా కారులు అరటిపండ్లు తప్పనిసరిగా తింటారు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు అరటిపండ్లు మంచి ఆహారం. శక్తి తో పాటు జీర్ణ వ్యవస్థని బాగు చేస్తుంది . ప్రీ మేనుస్ట్రువల్ సిండ్రోమ్ తో బాధ పడుతుంటే అరటిపండు చక్కని ఆహారం. ఆందోళన ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. ఇందులో ఐరన్  సమృద్ధిగా వుంది. ఎనిమీయా అరికడుతుంది. బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంచుటుంది. ఇందులోని పొటాషియం మెదడును అప్రమత్తంగా ఉంచుతుంది. కొన్ని వందల మంది విద్యార్థులకు అరటిపండు బ్రేక్ ఫాస్ట్ లో కానీ మధ్యాహ్నం భోజనం తర్వాత కానీ అరటిపండు తినే అలవాటు చేసుకోమంటున్నారు  పరిశోధకులు. చక్కెర  సుక్రోజ్ ఫ్రక్టోజ్  గ్లూకోజ్ పీచు వంటివి ఇందులో సహజ రూపంలో ఉన్నాయి .

Leave a comment