కళ్ళ కింద నలుపు పోవాలంటే బాదం పప్పులు, ద్రాక్షపళ్ళు ,కుంకుమ పువ్వు రేకులతో చక్కని ఫేస్ ప్యాక్ తయారు చేసి వాడుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. బాదం పప్పు పొడి గంధం పొడి బంగాళాదుంప రసం నిమ్మరసం కలిపి ఫేస్ పాక్ తయారు చేసి కళ్ళ కింద నల్లని వలయాలున్న చోట మృదువుగా రాయాలి. పది నిమిషాలు విశ్రాంతిగా ఉండి చల్లని నీళ్ళతో శుభ్రం చేయాలి. రోజు విడిచి రోజు ఈ మిశ్రమం రాస్తే కళ్లకింద వలయాలు పోతాయి. గింజలేపి దాక్షపండ్లు గుజ్జుగా చేసి నలుపు ఉన్నా చోట రాసి ,పది నిమిషాలు ఆగి కడిగేయాలి. తేనే,కుంకుమ పువ్వు రేకలు కలిపిన మిశ్రమాన్ని రాస్తే కళ్ళకింద నలుపు వలయాలు మాయమై ముఖకాంతి పెరుగుతోంది.

Leave a comment