ఎండ తాకిడి కి మోహన్ జిడ్డుదేరకుండ కొన్ని జాగ్రత్తలు తీసుకోమంటున్నారు  ఎక్సపర్ట్స్. మేకప్ వేసుకునే ముందర ఐస్ క్యూబ్ తో మొహం మర్దన చేస్తే మేకప్ ఎక్కువ సేపు చెదిరిపోకుండా ఉంటుంది. అర కప్పు బియ్యం పిండి లో బొప్పాయి గుజ్జు నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి ఈ మిశ్రమంతో మొహం పై నెమ్మదిగా మర్దన చేయాలి.అలాగే అర కప్పు పెసర పిండిలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని కూడా స్క్రబ్ లా  ఉపయోగించవచ్చు .ఆపిల్ గుజ్జు మొహం పైన ఫేస్ ప్యాక్ లా వేసుకుని పదినిమిషాలు అలా వదిలేస్తే జిడ్డు పీల్చేసి చర్మం కాంతిగా కనిపిస్తుంది.

Leave a comment